Suicide Note: కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. మనస్తాపంతో విద్యార్థి బలవన్మణం

by Shiva |
Suicide Note: కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. మనస్తాపంతో విద్యార్థి బలవన్మణం
X

దిశ, వెబ్‌డెస్క్: మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో కానూరులోని ఎన్ఆర్ఐ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఇటీవలే హాస్టల్ చేర్పించారు. ఈ క్రమంలో తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదని పలుమార్లు ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. అయినా వారు వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తమ కొడుకు మరణానికి కళాశాల యాజమాన్యమే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్‌లో ఉంది తమ కొడుకు రైటింగ్ కాదని.. కావాలనే కళాశాల యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుందని తల్లిదండ్రులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, బాలుడి రాసిన సూసూడ్ నోట్ అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ‘నాన్న నేను చనిపోతున్నా.. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ముందు నుంచి మీకు చెప్తున్నా.. అందువల్లే నేను చనిపోయేందుకు సిద్ధమయ్యాను. అన్నయ్యను బాగా చదివించండి.. నేను వెళ్లిపోతున్నందుకు బాధపడకండి’ అంటూ బాలుడు సూసైట్ నోట్‌లో వెల్లడించాడు.

Advertisement

Next Story